నిజంనిప్పులాంటిది

Apr 24 2024, 15:56

మనోళ్లు 18 రోజుల్లో రూ.670 కోట్ల విలువైన బీర్లు తాగేశారు

తాగుడు వ్యసనం కాదు. అలవాటు పడిన ఓ సంప్ర దాయం.'అని ఓ తెలుగు సినిమాలోని డైలాగ్ ఇది. ఆ డైలాగ్‌ను మన తెలంగాణ మందుబాబులు స్పూర్తిగా తీసుకున్నట్టు ఉన్నారు.

18 రోజుల్లోనే రికార్డు స్థాయి లో బీర్లు తాగేశారు. గత రికార్డులను తిరగరాస్తూ.. రూ.670 కోట్ల విలువైన బీర్లను మంచినీళ్ల ప్రాయం గా తాగేశారు. ప్రస్తుతం ఎన్నికలు సీజన్, ఎండలు తీవ్రత పెరగటం, ఆపై పెళ్లిళ్ల సీజన్ కావటంతో లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగాయి.

ఈ నెల 1 నుంచి ఏప్రిల్ 18 వరకు దాదాపు 670 కోట్ల రూపాయల విలువైన బీర్లను తాగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ 18 రోజుల్లో 23,58,827 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు 28.7 శాతం పెరిగినట్లు వెల్లడించారు.

ఎండలు అంతంత మాత్రం గా ఉండే ఏప్రిల్ నెలలోనే ఇలా తాగితే.. మే నెలలో ఏ రేంజ్ అమ్మకాలు సాగుతా తో అంచనా వేయవచ్చు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మద్యంపై వచ్చే ఆదాయం దాదాపు 30 వేల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం.

రానున్న కాలంలో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకు లు అంచనా వేస్తున్నా రు.ఎండలు దంచి కొట్టడం, పార్లమెంట్ ఎన్నికలు, పెళ్లి వంటి శుభకార్యాలు ఉండ టంతో బీర్ల సేల్స్ పెరిగినట్లు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లోని ఓ అధికారి వెల్లడించారు.

కేవలం ఒక్క బీరు సీసాలే ఈ రేంజ్‌లో అమ్ముడుపోతే మొత్తం మద్యం అమ్మాకలు ఏ రేంజ్‌లో ఉంటాయోనని పలువురు ఆశ్చర్యపోతు న్నారు. తెలంగాణలో మెుత్తం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వెయ్యికిపైగా బార్లు, క్లబ్‌లు, పర్యాటక హోటళ్లు ఉన్నాయి.

ఇందులోనూ మద్యం సర ఫరా ఉంది. వీటి ద్వారా రోజుకు రూ.90 నుంచి రూ.100 కోట్లు విలువైన మద్యం సేల్ అవుతుంది. కాగా, ప్రస్తుతం ప్రభుత్వం కూడా రోజు రోజుకు పెరిగి పోతున్న బీర్ల అమ్మకాలకు తగ్గట్టుగా స్టాక్ అందుబా టులో ఉంచుతోంది..

నిజంనిప్పులాంటిది

Apr 24 2024, 08:45

నేటి నుంచి తెలుగు రాష్ట్రాల బడులకు వేసవి సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోన్ని విద్యా సంస్థలకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవు తున్నాయి. ఏప్రిల్‌ 23వ తేదీతో పాఠశాలల పనిదినం ముగిసింది.

రాష్ట్రంలోని అన్ని పాఠశా లలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది.

అన్ని రకాల మేనేజ్‌మెంట్ల పరిధిలోని స్కూళ్లకు నేటి నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుల అనంతరం 2024-25 విద్యా సంవ త్సరానికి గానూ జూన్‌ 12 నుంచి స్కూళ్లు తిరిగి తెరచుకోనున్నాయి.

మరోవైపు తెలంగాణలోనూ ఏప్రిల్ 23వ తేదీతో చివరి పనిదినం ముగిసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.

ఏప్రిల్ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్‌ 12న బడులు తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలిసింది...

నిజంనిప్పులాంటిది

Apr 24 2024, 08:43

నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితా లు నేడు ఉదయం 11 గంట లకు విడుదల కానున్నాయి.

ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేయ నున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా తెలిపారు.

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితా లు ఒకేసారి విడుదల కాను న్నట్లు వెల్లడించారు.

పలితాల కోసం https://tsbie.cgg.gov.in లేదా https://results.cgg.gov.in వెబ్‌సైట్‌లోనూ చెక్ చేసుకోవచ్చని తెలిపారు.

రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిం దే.ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80, 978 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇందులో.. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు.

వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవ  త్సరంలో 46,542 మంది విద్యార్థులు ఉన్నారు...

నిజంనిప్పులాంటిది

Apr 24 2024, 08:41

ఈనెల 26న తెలంగాణకు ఉపరాష్ట్రపతి రాక

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ ఖడ్‌ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు.

పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి దృష్టి సారించారు.

ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటు రాకూడదని సక్రమంగా ఏర్పాట్లు చేయా లని సీఎస్‌ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశిం చారు...

నిజంనిప్పులాంటిది

Apr 24 2024, 08:40

నేటి నుండి కొనసాగనున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర
బీఆర్‌ఎస్‌ అధినేత, తెలం గాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రవ్యా ప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కాను న్నది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ యాత్ర కొన‌సాగించ‌బోయే బ‌స్సుకు తెలంగాణ భ‌వ‌న్‌ లో మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో గులా బీ శ్రేణులు పాల్గొన్నారు. నేటినుండి వరుసగా 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నది.

మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభ మై సిద్దిపేటలో జరిగే బహి రంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.

దాదాపు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్‌ చేశారు.

తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్‌ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియో జకవర్గాల నేతల నుంచి డిమాండ్‌ వస్తున్నది. అయి తే, సమయం తక్కువగా ఉండటం, ఎండ వేడి దృష్ట్యా కొన్ని నియోజక వర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు...

నిజంనిప్పులాంటిది

Apr 24 2024, 08:37

CSK 211 టార్గెట్ ను ఛేదించిన లక్నో

చెన్నై చిదంబరం స్టేడియం వేదిక‌గాలో సీఎస్‌కే తో తలపడిన లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. చెపాక్‌లో భారీ ఛేద‌న‌కు దిగిన ల‌క్నో.. చెన్నైపై లక్నో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

సీఎస్‌కే నిర్దేశించిన 211 పరుగుల ఛేదనలో లక్నో జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (0), కేఎల్ రాహుల్ (16) వెనుదిరిగారు.

ఈ క్రమంలో మార్కస్ స్టోయినిస్ సెంచరీతో విజృంభించాడు.63 బంతుల్లో 124 పరుగుల నాటౌట్ తో చెలరేగిపోయా డు. మరోవైపు నికోలస్ పూరన్,15 బంతుల్లో 34 పరుగులు, దీపక్ హుడా 6 బంతుల్లో 17 పరుగులు నాటౌట్, స్టోయినిస్‌కు మంచి స‌పోర్ట్‌గా నిలిచారు.

దీంతో చెన్నై జట్టు నిర్దేశిం చిన 211 పరుగుల లక్ష్యా న్ని 3 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి.. 6 వికెట్లతో గెలుపొందింది లక్నో. ఇక ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో 5వ స్థానంలో ఉన్న లక్నో 4వ స్థానానికి చేరుకుంది..

నిజంనిప్పులాంటిది

Apr 22 2024, 10:45

Madhavi Latha: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు

*•శ్రీరామనవమి ఊరేగింపులో మసీదు వైపు బాణం వదులుతున్నట్టు ఊహాజనిత సంకేతమిచ్చిన బీజేపీ అభ్యర్థి*

*•ముస్లింల మనోభావాలు దెబ్బతీశారంటూ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు*

*•బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు*

మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఫిర్యాదుపై హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదయింది. సిటీలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొన్న మాధవి.. సిద్ది అంబర్ బజార్ సర్కిల్ వద్ద ఉన్న మసీదు వైపు బాణం గురిపెట్టి వదులుతున్నట్టు ఊహాజనిత సంజ్ఞ చేశారని ఇమ్రాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఆమె బాధ్యతారహిత చర్యకు పాల్పడ్డారని, ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థిగా మాధవీ లతను ప్రకటించిన నాటి నుంచి ఆమె ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. దీంతో ఐపీసీలోని 295-ఏ (మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 ( ఉద్దేశపూర్వకంగా మతవిశ్వాసాలను రెచ్చగొట్టడం), హానికరమైన చర్యలకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

కాగా మసీదు వైపు బాణం వేస్తున్నట్టుగా మాధవీ లత ఇచ్చిన ఊహాజనిత సంజ్ఞకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్నికల సంఘం మౌనంగా ఉందంటూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ఈ విమర్శలపై మాధవీ లత స్పందిస్తూ.. వీడియో అసంపూర్తిగా ఉందన్నారు. వీడియో కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నానని కూడా ఆమె అన్నారు. సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో కూడా ప్రతిపక్షాలపై దాడి చేశారు. ప్రత్యర్థి పార్టీల పరువు తీయవద్దని, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దని మాధవి లత ఘాటుగా వ్యాఖ్యానించారు.

*హైదరాబాద్‌లో మే 13న పోలింగ్*

దేశంలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి, ఏప్రిల్ 19న 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే మే 13న హైదరాబాద్‌లో ఓటింగ్ జరగాల్సి ఉంది. 2004 నుండి అసదుద్దీన్ ఒవైసీ మరియు 1989 నుండి అతని తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ స్థానం నుండి మాధవి లత పార్టీ అభ్యర్థిగా ఉన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 20 2024, 07:46

చెన్నై ని చిత్తు చేసిన లక్నో

ఐపీఎల్ 2024లో భాగంగా హోం గ్రౌండ్‌లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది.

చెన్నై నిర్దేశించిన 177 పరుగుల ఛేదనలో లక్నో ఓపెనర్లు చెలరేగిపోయారు. దీంతో సీఎస్‌కేపై జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొం దింది.

సొంత గడ్డ పై CSK ను త‌క్కువ‌కే క‌ట్ట‌డి చేసిన ల‌క్నోకు ఓపెన‌ర్లు శుభా రంభ‌మిచ్చారు. క్వింట‌న్ డికాక్‌(54), కెప్టెన్ కేఎల్ రాహుల్(82) చ‌రో హాఫ్ సెంచ‌రీతో చెన్నై బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతున్నారు.

ఇక ఆ త‌రువాత వ‌చ్చిన నికోలస్ పూరన్ 23,నాటౌట్ మెప్పించాడు. దాంతో 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసిన లక్నో… 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరనా చెరో వికెట్ దక్కించుకున్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 20 2024, 07:45

ఎగ్జిట్ పోల్ జూన్ 1 వరకు రద్దు?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిన్ను ప్రారంభం అయ్యా యి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహి స్తున్నారు.

మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో 12 రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

నిన్ను దేశంలో తొలి దశ పోలింగ్ జరిగింది.ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

దేశంలో ఎన్నికలు జరుగు తున్నందున ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ స్పష్టం చేసింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎన్నికల ఫలితాలు, సర్వేలు, ఒపీని యన్ పోల్స్ ప్రదర్శించరా దని ఈసీ పేర్కొంది.

నిజంనిప్పులాంటిది

Apr 19 2024, 07:54

విధుల్లో నిర్లక్ష్యం ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌

హైదరాబాద్ మల్టీజోన్‌ -1 పరిధిలో విధుల్లో అలసత్వం వహించిన ఆరుగురు పోలీసు అధికారులను ఐజీ ఏవీ రంగనాథ్‌ గురువారం సాయంత్రం సస్పెండ్‌ చేశారు.

సస్పెండ్‌ అయిన వారిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఉన్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ప్రజా భవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ను తప్పించేందుకే పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌తో సంప్రదింపులు జరిపినట్టుగా హైదరాబాద్‌ సీపీ విచారణలో తేలడంతో అప్పటి బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేశారు.

మద్యం సేవించి పోలీస్‌స్టే షన్‌కు వచ్చి స్టేషన్‌ సిబ్బం దిని ఇబ్బందులకుగురి చేసిన నిజామాబాద్‌ జిల్లా సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రమేశ్‌ను సస్పెండ్‌ చేశారు.

జగిత్యాల జిల్లా సారంగా పూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన గంజాయి కేసులో అలసత్వంగా వ్యవహారిం చిన ఎస్సైలు మనోహర్ రావు, తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ బి. రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ టి.నరేం దర్ లను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- 1 ఐజీ రంగ నాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు...